పవన్ కళ్యాణ్ తో మంచు విష్ణు కబుర్లు.. వీడియో వైరల్ !

-

మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఎన్నికలు పూర్తి అయి పోయి… పది రోజులు గడుస్తున్నప్పటీకి…. ఒకరి పై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక తాజాగా గవర్నర్‌ దత్తాత్రేయ ఆధ్వర్యం లో అలయ్‌ – బలాయ్‌ కార్యక్రమం జంతర్‌ మంతర్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మరియు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిలుగా హజరయ్యారు.

అయితే.. ఈ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌.. మంచు విష్ణు ను అస్సలు పట్టించుకోలేదని… టీవీ చానెళ్లు మరియు సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక దీనిపై నిన్న మంచు విష్ణు తిరుపతిలో కూడా స్పందించారు. అవన్ని… తప్పుడు వార్తలని.. పవన్‌ కళ్యాణ్‌ తాను ఆ కార్యక్రమంలో చాలా బాగా మాట్లాడుకున్నామని చెప్పారు మంచు విష్ణు.

స్టేజ్‌ పైకి ఎక్కిన తర్వాత.. ఎవరి స్థానంలో వాళ్లం కూర్చున్నామని చెప్పారు. అయితే.. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ తో మాట్లాడిన వీడియోను మంచు విష్ణు షేర్‌ చేశారు. ఈ వీడియోలో పవన్‌ కళ్యాణ్‌ మరియు మంచు విష్ణు చాలా సరదగా ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news