మంత్రి జోగి రమేష్: పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసిపోయాడు… జనసైనికులు జగన్ తో కలవండి! 

-

ఏపీ మంత్రి జోగి రమేష్ తాజాగా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ల బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒక స్టాండ్ పై ఉండడు.. బీజేపీతో పెళ్లి టీడీపీతో సంసారం అన్న రీతిలో పవన్ రాజకీయ సాగుతోంది అన్నారు. పవన్ కు దమ్ము ఉంటే ఏపీలో 175 స్థానాలలో పోటీ చేయాలి… లేదా సన్నాసి అయితే టీడీపీలో జనసేన ను కలపాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు జోగి రమేష్. కొందరు అమాయకుడు పవన్ కళ్యాణ్ ను కాబోయే సీఎం అంటారు, కానీ పవన్ మాత్రం చంద్రబాబు రాబోయే సీఎం అంటున్నాడు.

అందరినీ పవన్ చంద్రబాబుకు అమ్మెస్తాడు.. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని ఎటువంటి ఉపయోగం లేని జనసైనికులు సైతం జగన్ కు అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై టీడీపీ లేదా జనసేన నుండి ఏమైనా స్పందన ఉంటుందా చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news