మరో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.. అవన్నీ కుట్రలే !

-

భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మరో లేఖ రాశారు. కామ్రేడ్ శారదా, కామ్రేడ్ హిడ్మా ఆరోగ్యంగానే ఉన్నారని… పాలకులు, ప్రభుత్వలు కావాలనే ఉద్దేశ్యపూ ర్వకంగా దృష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కావాలనే హిడ్మా, శారదా కరోన వైరస్ తో చనిపోయరని ప్రచారం చేస్తున్నారని… ఆ ప్రచారాన్ని ప్రజలు, కుటుంబ సభ్యులు నమ్మవద్దని సూచించారు. ఇలాంటి విషయాలపై పార్టీ అధికారికంగా నిజాలను తెలియజేస్తుందని…అప్పుడు మాత్రమే ప్రజలు నమ్మాలి అని విజ్ఞప్తి చేశారు జగన్.

మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు చెప్తున్న అబద్ధపు ప్రచారం పూర్తిగా బూటకమని… మేము కరోనాకు అతీతులం కాదని… మేము ప్రజల మధ్య జీవిస్తున్నామన్నారు. కరోనా వైరస్ సోకి కామ్రేడ్ హరిభూషన్, కామ్రేడ్ భారతక్కలు భౌతికంగా ప్రజలకు దూరం అయ్యారని తెలిపారు. కరోనా వైరస్ వల్ల వందలాది ప్రజలు ప్రాణలు కోల్పోతుంటే వారి జీవితాలకు గ్యారెంటీ ఇవ్వకుండా టిఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వలు మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని ప్రయత్నాలు చేస్తోందని ఫైర్‌ అయ్యారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news