షాకింగ్ : ప్ర‌ముఖ యువ న‌టుడు ఆత్మ‌హ‌త్య..!

-

భారత చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే (32) నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నాందేడ్‌లోని తన తల్లిదండ్రుల నివాసంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే అతడు గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అశుతోష్ భక్రే ”భకార్, ఇచర్ థార్లా” లాంటి మరాఠీ సినిమాల్లో నటించి ఫేమ్ అయ్యారు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. ‘ఖుల్తా కాళీ ఖులేనా’ అనే సీరియల్ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు. ఇటీవలే యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడటంతో ఉలిక్కిపడ్డ సినీ లోకం.. ఇంతలోనే మరో యువ నటుడి ఆత్మహత్య చూడాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news