గుంటూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం..హత్య

-

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచార ఘటన మరువక ముందే ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది.గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి లో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు.పోలీసుల కథనం ప్రకారం..తుమ్మపూడి కి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టె పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది.ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు.వీరికి ఇద్దరు పిల్లలు.ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండడాన్ని గుర్తించారు.తిరుపతమ్మ మృతదేహంపై గోళ్ళ తో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు.దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.కాగా యువతి మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు.ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులను పోలీసులు గుర్తించారు.తిరుపతమ్మ కు తెలిసిన వారే హత్యకు పాల్పడి ఉంటారని గుర్తించారు.ఘటనా స్థలంలో నిందితులు తాగి పడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని..అత్యాచారానికి పాల్పడి యువతిని హత్యచేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం దుగ్గిరాల మండల కమిటీ కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వి. సాంబశివరావు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news