ఘోర ప్రమాదం : ఐదుగురు సజీవదహనం..!

-

ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో.. ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా హరియూరు వద్ద ఈ ఉదయం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయ్‌పుర వెళ్తున్న ఓ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసింది.

పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇక ఈ ఘోర ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టిన అధికారులు.. ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news