హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 8 లక్షల నష్టం !

-

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి వినాయక నగర్ బస్తీ లోని పరుపుల పరిశ్రమ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ మంటలను చూసి అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీసిన స్థానికులు… దట్టమైన పొగ కమ్మెయడంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది కి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో 8 లక్షల మేరా ఆస్తి నష్టం జరిగి ఉంటుంది వెల్లడించింది అగ్నిమాపక సిబ్బంది. పరిశ్రమ కు ఏలాంటి అనుమతులు లేవని గుర్తించారు అధికారులు. బస్తీ మద్య లో నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ కొనసాగిస్తున్నట్లు ఆందోళన చేస్తున్న బస్తీ వాసులు.. అనుమతులు లేని పరిశ్రమ లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తే…….జరగరాని ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ వాపోతున్నారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news