పోసానిని మెంటల్‌ ఆస్పత్రిలో చేర్చాలి : నిహారిక ఫైర్‌ !

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై పోసాని కృష్ణ మురళి నిన్న సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తి గత జీవితంపై పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. పోసాని పై పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు. అయితే.. తాజాగా పోసాని కృష్ణ మురళి పై జనసేన పార్టీ నాయకులు నిహారిక ఫైర్‌ అయ్యారు. పోసాని కృష్ణ మురళి ని వెంటనే మెంటల్‌ ఆస్పత్రి లో చేర్పించాలని నిహారిక డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం స్పందించి పోసాని కృష్ణ మురళి పై చర్యలు తీసుకోవాలని నిహారిక డిమాండ్‌ చేశారు. రిపబ్లిక్‌ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్‌ ఆడవాళ్ల పై అసభ్యకరంగా ఒక్క మాట మాట్లాడ లేదని స్పష్టం చేశారు.. ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి పై పవన్ కళ్యాణ్‌ కామెంట్స్ చేసినoదుకే పోసాని కృష్ణ మురళి ఇలా రియాక్ట్ అవుతున్నారని నిప్పులు చెరిగారు నిహారిక.. ప్రభుత్వం స్పందించి… వెంటనే పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని డిమాండ్‌ చేశారు. అలాంటి వారిని వదలకూడదని డిమాండ్‌ చేశారు నిహారిక.

Read more RELATED
Recommended to you

Latest news