చిరంజీవిపై మేఘనారాజ్‌ భావోద్వేగ‌పు పోస్ట్..సర్జా మరణం తీవ్ర మనోవేదనకు గురి చేసిందంటూ..

-

క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా జయంతి సంధర్భంగా నటి మేఘనారాజ్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగ‌పు పోస్ట్ పెట్టింది..సర్జా మృతి తనని తీవ్ర మనోవేదనకు గురి చేసిందనన్నారు మేఘానా..సర్జాను గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో త‌ర‌చు పోస్ట్‌లు షేర్ చేస్తుంది మేఘనారాజ్..తాజాగా త‌న భ‌ర్త చిరంజీవి స‌ర్జా జ‌యంతి సంద‌ర్భంగా మేఘ‌నా భావోద్వేగ‌పు పోస్ట్ షేర్ చేసింది. హ్యాపీ బ‌ర్త్‌డే మై వ‌ర‌ల్డ్‌..చిరు ఐ ల‌వ్ యూ.. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో ఉన్న చిరంజీవి ఫోటోని షేర్ చేసింది. మేఘ‌నా పోస్ట్‌కు నెటిజ‌న్స్ జ‌యంత్సుత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మిస్ యూ అన్నా అని కామెంట్స్ పెడుతున్నారు.


చిరంజీవి మ‌ర‌ణించే స‌మ‌యంలో మేఘనారాజ్ గర్భవతి కావడంతో తండ్రి కాబోతున్నానని ఆనందంలో మునిగిపోయిన ఆయ‌న అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు..చిరంజీవి సర్జా మరణాన్ని తట్టుకోలేకపోతుంది మేఘానారాజ్.మ‌రోవైపు చిరు జ‌యంతి సందర్భంగా ఆయ‌న న‌టించిన శివార్జున చిత్రాన్ని క‌ర్ణాట‌క‌లో రీరిలీజ్ చేయ‌బోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news