ఫుల్ జోష్లో మెహ్రీన్.. మాల్దీవులంతా తనదే అన్నట్టు..!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ తమన్నా గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తమన్నా అంతటి అందంతో మరింతగా కుర్ర కారును ఆకట్టుకుంటుంది. ఇకపోతే చివరిగా ఎఫ్ త్రీ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక.. వెకేషన్ ను ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఇటలీలో విహరించిన ఈ ముద్దుగుమ్మ .. ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవుతోంది. మాల్దీవులు అంతా తనదే అన్నట్టుగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ తనను తాను మైమరిచిపోయి మరింతగా యువతను ఆకట్టుకుంటోంది.

( Photos : Instagram )

తాజాగా వింటర్ వెకేషన్ లో ఉన్న ఈమె రకరకాల గ్లామర్ ఫోటోలతో మరింతగా నెట్టింట రచ్చ చేస్తుందని చెప్పాలి. తన గ్లామర్ షో తో కుర్రకారును ఆకట్టుకుంటూనే ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది ఈ వయ్యారి. ప్రస్తుతం ఈమె షేర్ చేసుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నాని హీరోగా సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా మెహ్రీన్ తెలుగు తెరకు పరిచయమయింది. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఆ తర్వాత అనిల్ డైరెక్షన్లోనే ఎన్నో సినిమాలు చేసింది.

వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్లుగా వచ్చిన ఎఫ్2 సినిమాలో హనీ పాత్రలో అందరినీ ఆకట్టుకున్న ఈమె మళ్లీ ఎఫ్ 3 సినిమాలో కూడా నటించి మరింతగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే వెకేషన్ ఎంజాయ్ చేస్తూ మరింతగా తనను తాను మైమరిచిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఏమైనా వెకేషన్ మోడ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది మెహ్రీన్.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

Read more RELATED
Recommended to you

Latest news