ప్రధాని మోడీ నా భుజంపై చేయి వేసి మెచ్చుకున్నారు – విజయ సాయిరెడ్డి

-

ప్రధాని మోడీ నా భుజంపై చేయి వేసి మెచ్చుకున్నారన్నారు విజయ సాయిరెడ్డి. ఇవాళ విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నిన్న విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి ఘన స్వాగతం పలికారు విజయసాయిరెడ్డి.

ఈ సందర్భంగా ఆయన ఆప్యాయంగా నా భుజంపై తట్టి కుశల ప్రశ్నలు అడిగారని ఓ ట్విట్టర్ వేదికగా ఫోటోను షేర్ చేసి తెలిపారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరో ట్వీట్ లో నారా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. హెరిటేజ్ ఫ్రెష్ ను ఎంతకు విక్రయించావు? ‘వైట్’ చూపించింది ఎంత? టేకోవర్ చేసిన ఫ్యూచర్ గ్రూప్ తన వ్యాపారం మొత్తాన్ని ఇంకొకరికి 24 వేల కోట్లకు అమ్మింది. ఈ మొత్తం వ్యవహారంపై ED, CBI దర్యాప్తు కోరుతూ లేఖ రాసే దమ్ముందా? కనీసం 20 ఏళ్ల శిక్ష పడుతుందయ్యా నారా చందూ నీ నేరాలకు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news