మాజీ ఎంపీ: నా తమ్ముడు ద్రోహం చేశాడు !

-

వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుత రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ ఒక్క సీటును గెలుచుకున్నందుకు రాష్ట్రము అంతా గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మేకపాటి మాట్లాడుతూ వైసీపీకి అనుకూలంగా జరగాల్సిన ఓటులో క్రాస్ ఓటింగ్ జరగడం, అది కూడా మా తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వలన వైసీపీ ఒక ఎమ్మెల్సీ ని కోల్పోవడం నిజంగా బాధాకరం అని చెప్పాలి.

నేను వ్యక్తిగతంగా ఇలా జరిగినందుకు బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. చంద్రశేఖర్ రెడ్డి పేరుకే నాకు తమ్ముడు, నా మాట వినకుండా పార్టీకి ద్రోహం చేశాడు. కాబట్టి ఉదయగిరిలో వైసీపీ తరపున ఎవరిని నిలబెట్టిన గెలిపించుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news