హైదరాబాద్‌ ప్రయాణికులు షాక్‌..భారీగా పెరగనున్న మెట్రో టికెట్‌ ధరలు !

-

హైదరాబాద్‌ ప్రయాణికులు బిగ్‌ షాక్‌ తగిలింది. మెట్రో టికెట్‌ ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది యాజమాన్యం. మెట్రో ఛార్జీలను 25 నుంచి 30% వరకు పెంచేందుకు కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచిన ధరలను అమలు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఈ చార్జీల పెంపునకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఫెయిర్ ఫికేషన్స్ కమిటీని ఏర్పాటు చేసింది హైదరాబాద్ మెట్రో యాజమాన్యం. ఈ కమిటీకి ఈ మెయిల్స్ ద్వారా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు విధించిన గడువు నేటితో ముగియనుండగా ఇప్పటికే చాలామంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ప్రజలను విభిన్నమైన సలహాలు, సూచనలు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news