సభలో మాట్లాడేందుకు టీడీపీ సభ్యుల వద్ద ఎలాంటి సబ్జెక్ట్ లేదు : మంత్రి చెల్లుబోయిన

-

వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు కేటాయించిన కుర్చీ పైకి ఎక్కి బాలకృష్ణ ఈలలు వేశారని ఆయన తెలిపారు. టీడీపీ నేతల దగ్గర విషయం లేదని విమర్శించారు. చంద్రబాబు యువతకు ద్రోహం చేశాడని.. 5 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి యువతను మోసం చేశాడని ఆయన ఆరోపణలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో ప్రధాన ముద్ధాయి అని అప్పటి అధికారులే చెప్పారని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు హాని తల పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు.

Minister Chelluboina Venu: ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్దినం  - NTV Telugu

రచ్చ చేయడనికే టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారన్నారు. గొడవ చేసిన ఆరుగురి సభ్యులను సస్పెండ్ చేస్తే మిగతా టీడీపీ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మిగతా వారు కూర్చొని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమ వాదనలు వినిపించవచ్చు కదా? సభలో సమస్యలు చెప్పవచ్చు కదా? అని ప్రశ్నించారు. టీడీపీకి ప్రజాసమస్యలు పట్టవన్నారు. చంద్రబాబు నేరం చేసిన గజదొంగ అని, అందుకే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేసిందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news