పనిచేసే వాళ్ళు ఎవరు.. ఉన్నది ఉడగొట్టింది ఎవరు ఆలోచించాలి – మంత్రి హరీష్ రావు

-

పటాన్చెరువులో కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ గారికి కొండా లక్ష్మణ్ గారికి దగ్గర సంబంధం ఉండేది అన్నారు. గాంధీ విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అని చరక నడిపారని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ భర్తను జైల్లో పెడితే రూపాయి ఫీజు తీసుకోకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ బయటకు తీసుకు వచ్చారని అన్నారు.

తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసిన ఘనత కొండ లక్ష్మణ్ బాపూజీదన్నారు. అంతలా పదవులు త్యాగం చేసింది మళ్ళీ కేసీఆర్ అని కొనియాడారు. కేంద్రంలో ఉండే బిజెపి ప్రభుత్వం కులవృత్తులకు ఏం చేసిందని ప్రశ్నించారు. పని చేసే వాళ్ళు ఎవరు.. ఉన్నది ఊడగొట్టింది ఎవరో ఆలోచించాలన్నారు మంత్రి హరీష్ రావు. పద్మశాలీల కోసం పటాన్చెరువులో మంచి భవనం నిర్మిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news