కరోనా కలకలం : స్వీయ గృహ నిర్బంధంలో హరీశ్‌రావు..!

-

కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తుంది. సామాన్య ప్రజల నుంచి అగ్ర నేతల దాక అందరినీ వణికిస్తుంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకిన వార్త తెలిసిన మర్నాడే సిద్ధిపేటలోని మంత్రి హరీష్ రావు పీఏకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే, ఈ ఫలితాల్లో మంత్రి సహా 17 మందికి నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news