కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఇక తిరుగుబాటే.. మంత్రి జగదీష్‌రెడ్డి వార్నింగ్

-

సూర్యాపేట : రెండు రోజుల నుంచి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరియు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు.కోమటిరెడ్డి బ్రదర్స్ కు విజ్ఞత ఉంటే అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్న మంత్రి జగదీష్ రెడ్డి.. లేదంటే సొంత నియోజకవర్గ ప్రజల నుంచే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని.. బ్రదర్స్ ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని చురకలు అంటించారు. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦ కానీ ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఫైర్ అయ్యారు. వారి ధ్యాస డబ్బు సంపాదన పైనేనని మండిపడ్డారు. ప్రజల కోసం ఏ రోజు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ పని చేయలేదని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ది అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news