గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం నేతలకు రుచిచూపిస్తాం : గుమ్మనూరు జయరాం

-

మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం నేతలకు రుచిచూపిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్‌లో పేరే ఉండదని జయరాం వ్యాఖ్యానించారు. కర్నూలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి జీ జయరాం విలేెకరులతో మాట్లాడారు. ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రజలు, వారి సంక్షేమం గురించి ఆలోచించ లేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికొస్తోండటంతో మళ్లీ ప్రజల్లోకి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడని ధ్వజమెత్తారు.

2024 తనకు చివరి ఎన్నికలు అని మాట్లాడుతున్న చంద్రబాబు.. అప్పుడు కూడా పోటీ చేస్తాడో.. లేదోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు జయరాం. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై కర్నూలు జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తోన్నాడని మండిపడ్డారు. ఇన్నేళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఏ మాత్రం ఆదరాభిమానాలను సంపాదించుకోలేకపోయారని చురకలు అంటించారు. అందుకే సానుభూతితో ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు జయరాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version