చంద్రబాబు వెన్నుపోటుకు వాడిన పదునైన కత్తి యనమల – మంత్రి జోగి రమేష్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్. చచ్చిపోయిన, వెంటిలేటర్ పై ఉన్న టిడిపిని లేపడానికి టిడిపి మీడియా తెగ తాపత్రయ పడుతుందన్నారు. వీరు కళ్ళు ఉన్నా చూడలేని కబోదులు అన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు చరిత్ర హీనుడని మండిపడ్డారు.

jogi ramesh

మూడు సెంట్ల స్థలం ఇచ్చి పూర్తిగా ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు మోసం చేశాడని.. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు చేతిలో పెట్టిన వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబు, లోకేష్ తో సహా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చకు సిద్ధమా? నాతో పాటు జగనన్న కాలనీలకు రండి.. అంటూ సవాల్ విసిరారు. మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోతుందని చెప్పిన చంద్రబాబు నేడు ఫ్లైట్ ఫిరాయించాడని.. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానని చంద్రబాబు అంటున్నాడని చెప్పారు. అంటే జగన్ అడుగుజాడల్లో చంద్రబాబు అడుగులు వేస్తాను అన్నట్లే కదా? అన్నారు.

ఇక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. పచ్చకామర్ల వాళ్లకు అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు యనమల వ్యవహారం ఉందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాపంలో యనమల భాగస్వామ్యం ఉందన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు వాడిన పదునైన కత్తి యనమల అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు, యనమల వారి ఆస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news