చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు : కాకాని

-

ఈరోజు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు పై సెటైర్ల వర్షం కురిపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అక్కడ మంత్రి కాకాని ప్రసంగిస్తూ, 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు సభలకు ప్రజలు రావడం లేదని.. అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు.

Revolutionary changes visible in agri sector: Kakani Govardhan Reddy

పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తామని చెబుతున్నాడు.. ఇది సాధ్యమయ్యేదేనా అంటూ ఆయన హేళన చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారుమంత్రి కాకాని. జిల్లాలో నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తి చేసి ప్రారంభించినట్టు తెలిపారు. సోమశిల.. కండలేరులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని అన్నారు ఆయన. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి వరద నీటిని పంపే కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచిన ఘనత తమదేనని ఆయన పేర్కొన్నారు మంత్రి కాకాని.

 

 

Read more RELATED
Recommended to you

Latest news