జాతీయ రాజకీయాల ఎంట్రీ.. ఈ నెలలోనే ప్రకటన : కేటీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు వస్తున్న సంకేతాలపై క్లారిటీ ఇస్తూ మంత్రి కేటీఆర్‌ నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలతో పాటు ముఖ్య నేతలతో భేటీలు అవుతూ వస్తున్నారు. అంతేకాకుండా రోజు రోజుకు బీజేపీపై పోరు కసరత్తులు చేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Minister KTR lashes Out At Centre's Inefficient Vaccine Policy;  Says Centre Bungled Up And Pitted States Aganist Each Other

ఈ నెల 18 లేదా 19న జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. 8వ తేదీ లోపే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో జాతీయ పార్టీ గురించి క్లారిటీ ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌. ఇదిలా ఉంటే, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ రిపోర్ట్ ప్రకారం టీఆర్ఎస్ హవా తగ్గలేదని వివరించారు మంత్రి కేటీఆర్‌. అటు, టికెట్లపై సిట్టింగ్లలు ఆశలు పెట్టుకోవద్దని, మార్పులు కచ్చితంగా ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news