కేసీఆర్‌ ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదు : కిషన్‌ రెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు.

Shri G. Kishan Reddy Union Minister for DoNER, Tourism and Culture today  interacted with Chief Ministers of four North Eastern States

మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17ను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రం నిర్వహిస్తోందన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా.. సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 2వరకు సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. వివిధ రూపాల్లో 27 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. డబుల్ బెడ్రూం, పెన్షన్లపై కేసీఆర్ ఇచ్చిన మాట మాట తప్పారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news