రేపు నిజామాబాద్ పర్యటనకు మంత్రి కేటీఆర్

-

రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పాత కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కళాభారతికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రైల్వే కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించడంతోపాటు కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు మంత్రి. కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు మంత్రి కేటీఆర్. అనంతరం ఉదయం 11 గంటలకు రైల్వే అండ్ బ్రిడ్జి ప్రారంభించడంతోపాటు కళాభారతికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news