స్కూల్ విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త

-

 

ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో సన్నబియ్యంతో భోజన పథకం అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అనౌన్స్ చేశారు. జూన్ 12వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 41 వేల స్కూలు, నాలుగువేల సంక్షేమ హాస్టల్లలో ఈ విధానాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అన్నదాతల గౌరవాన్ని పెంచే విధంగా వారి చేతుల మీదుగానే బియ్యం పంపిణీ కొనసాగిస్తామని తెలియజేశాడు.

CM Chandrababu Naidu wishes workers on the occasion of Mahanadu
Minister Nadendla Manohar announced that a meal scheme with brown rice will be implemented during midday meal for students studying in government schools.

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం కొడాలి మార్కెట్ యార్డ్ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్కూళ్లు, హాస్టల్లలో ఉండే విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భోజన సమయంలో విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొనే వారిమని సన్నబియ్యం పథకాన్ని అమలు చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా నేటి నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు స్కూళ్లలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు లేదా ఎల్లుండి నుంచి విద్యార్థులకు తరగతి క్లాసులు ప్రారంభమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news