ప్ర‌భుత్వంలో ఉన్నాం కాబ‌ట్టే స‌హనంతో ఉన్నం : మంత్రి పువ్వాడ

-

కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు పై తీన్మార్ మ‌ల్ల‌న పెట్టిన ట్వీట్ట‌ర్ పోస్టు పై తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ స్పందించారు. బీజేపీ నాయకులు వ్య‌క్తిగత ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. చిన్న పిల్ల‌ల‌పై కూడా అత్యంత నీచంగా మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హించారు. ప్ర‌భుత్వంలో తాము ఉన్నం కాబ‌ట్టే స‌హ‌నంతో ఉన్నామ‌ని అన్నారు. లేకుంటే కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని అన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఎందుకు దీక్ష చేస్తున్నార‌ని అన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్ర‌భుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని బండి సంజ‌య్ దీక్ష చేస్తున్నారా.. అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలపై చ‌ర్చించేందుకు మంత్రుల‌కు స‌మ‌యం ఇవ్వ‌ని బీజేపీ నాయకులు నీతులు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. అలాగే ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. ఢిల్లీలో ప‌డిగాపులు కాసినా.. త‌మ‌కు స‌మ‌యం ఇవ్వ‌లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news