8 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబును ఏమనాలి? – మంత్రి రోజా

-

బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షో సందర్భంగా తొక్కి సలాట చోటు చేసుకుని ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేడు ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో 8 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబును ఏమనాలని బండి పడ్డారు మంత్రి ఆర్కే రోజా. నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి రోజా.

అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీటింగ్ లో జరిగిన ఘటన చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అన్నారు. చంద్రబాబు తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించాలని.. ఇది రాజకీయ హత్య అన్నారు మంత్రి రోజా. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలు తీశాడని.. ఇప్పుడు 8 మంది ప్రాణాలను బలిగొన్నాడని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news