పవన్‌.. ముందు నీ బతుకేంటో చూసుకో : మంత్రి రోజా

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మంత్రి రోజా రోజు రోజుకు మరింత రెచ్చిపోతుంది. ఓ పక్క జనసేన శ్రేణులు రోజా తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ..రోజా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. కేవలం రోజా మాత్రమే కాదు వైసీపీ మంత్రులెవరూ కూడా వారి వారి శాఖలకు సంబదించిన ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టింది లేదు..కేవలం పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకే మీడియా ముందుకు వస్తారని అంటున్నప్పటికీ..వారు మా తీరు అన్నట్లే ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరోసారి అలాగే వైసీపీ నేతలు రెచ్చిపోయారు.

Andhra Pradesh: RK Roja responds to cross voting, says those MLAs will face  ire of people

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని సీఎం జగన్ అనేంతటివాడివా నువ్వు… ముందు నీ బతుకేంటో చూసుకో అని ఘాటుగా బదులిచ్చారు. జగన్ కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పటిదాకా వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయాడని రోజా ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ కల్యాణ్ అని, తన స్థాయికి మించి మాట్లాడడం తగదని హితవు పలికారు. జగన్ 13 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారని, మరో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని రోజా వెల్లడించారు. జగన్ ఒకసారి విపక్ష నేతగా ఉన్నారని, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం పీఠం అధిష్ఠించారని వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news