పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు.. పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే తెలియదంటూ..

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు ఏపీ పర్యటకశాఖ మంత్రి రోజా. జనసేన పార్టీని స్థాపించి తొమ్మిదేళ్లు అవుతుందని.. ఆ పార్టీని ఎందుకు పెట్టాడనే దానిపై పవన్ కళ్యాణ్ కి కూడా క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. నేడు నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో చేపట్టిన “జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనసేన పార్టీని స్థాపించి ఇన్నేళ్లు గడిచినా ఎవరికోసం పార్టీ పెట్టాడు? ఏం చేయడానికి పార్టీ పెట్టాడు? అనే విషయంలో ఆయనకు క్లారిటీ లేదన్నారు.

పవన్ కళ్యాణ్ పైన, ఆయన పార్టీ పైన ప్రజలకు అస్సలు నమ్మకమే లేదన్నారు. జనసేన కార్యకర్తలకు ఎప్పుడు ఎవరి జెండా మోయాలో, ఎవరిని తిట్టాలో తెలియక గందరగోళం నెలకొందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పాటు ఇలాంటి వాళ్ళు ఏకమై ఎంతమంది వచ్చినా.. సింగిల్ గా వచ్చేసి సింహం జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news