రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదు: మోదీ

-

రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం కలిసి రావట్లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్రప్రభుత్వం బాధపడుతోందని మండిపడ్డారు.

కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని మోదీ స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు వేస్తున్నామని తెలిపారు. డిజిటల్‌ విధానం ద్వారా దళారీవిధానం లేకుండా చేశామన్న ప్రధాని.. అవినీతిపరులకు నిజాయితీతో పనిచేసే వారంటే భయమని అన్నారు.

‘దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా? అవినీతిపరులపై పోరాటం చేయాలా వద్దా అవినీతిపరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా? వద్దా? అవినీతిపరులకు కోర్టుల్లోనూ చుక్కెదురవుతోంది. కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తాం.’ అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news