BREAKING : బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు

-

హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని హైదరాబాద్ డీఈవోని ఆదేశించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర పాఠశాలల్లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబితా ప్రకటించారు. కమిటీ నివేదిక వారం రోజుల్లోగా అందిస్తోందని పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో పాఠశాల ప్రిన్సిపల్‌, కారు డ్రైవర్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news