జులై 17, 18న మహంకాళి జాతర: మంత్రి తలసాని

-

ఇటీవల మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరిశీలించారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అనంతరం ఉజ్జయిని ఆలయానికి చేరుకుని.. ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రతిపక్ష పార్టీలు పన్నాగం పన్నుతున్నాయన్నారు. ఆలయంలో మూల విరాట్ మార్పు ఆలోచన లేదన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ ప్రతిష్ట భంగం చేయాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిని అమ్మవారే శిక్షిస్తుందన్నారు. అలాగే ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని, ప్రతిపక్షాలు రోడ్డెక్కి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news