3 కోట్లు ఇవ్వాలని మంత్రినే బెదిరించారు…!

-

సాధారణంగా బలవనతంగా వసూళ్లు చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు…? డబ్బులు ఎక్కువగా ఉండే వాళ్ళను కిడ్నాప్ చేయడమో, లేక చంపేస్తామని బెదిరించడమో అప్రతిష్ట పాలు చేయడమో చేస్తూ ఉంటారు. కాని కొంత మంది యువకులు ఏకంగా మంత్రిని బెదిరించారు. ఈ ఆశ్చర్యకర ఘటన గోవాలో చోటు చేసుకుంది. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తమకు రూ.3కోట్లు ఇవ్వాలని లేదంటే అప్రతిష్టపాలు చేయడంతోపాటు హతమారుస్తామని మంత్రిని ముగ్గురు యువకులు ఫోన్‌లో బెదిరించారు. ఈ ఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాలో కలకలం రేపింది. ఆ రాష్ట్ర ప్రజా పన్నుల శాఖ మంత్రి దీపక్ పౌష్కర్ కు ముంబై నగరానికి చెందిన ముగ్గురు గుర్తుతెలియని యువకులు ఫోన్ చేసి, తమకు రూ.3 కోట్లు ఇవ్వాలని,

లేదంటే అతన్ని అప్రతిష్ట పాలు చేయడంతోపాటు హత్య చేస్తామని మంత్రిని బెదిరించారు. ఆయనకు ఆ యువకులు పలు మార్లు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. దీనితో విసిగిపోయిన మంత్రి గారు పోలీసులకు ఇర్యాదు చేసారు. దీనితో పోలీసులు పథకం ప్రకారం డబ్బులు ఇస్తామని పిలిచి ముగ్గురిని విచారిస్తున్నారు. ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news