మంత్రి జగదీష్ రెడ్డి : కేంద్రప్రభుత్వమే నిరుద్యోగ సమస్యకు కారణం ..

-

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి విపక్షాలపై తన దైన వాడివేడి కామెంట్ లతో విరుచుకుపడ్డారు. ఈయన మాట్లాడుతూ గత కొంతకాలంగా మేము చూస్తున్నాము రాష్ట్రంలో ర్యాలీలు , నిరుద్యోగ సభలు ఎక్కువయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశామో ఒకసారి చూసుకోండి అంటూ జగదీశ్ రెడ్డి సెటైర్ వేశారు. మా ప్రభుత్వం రాక ముందు వరకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు పేపర్ లీకేజీల మీద మాట్లాడిన వారిని పట్టుకున్నా , ఆ విషయాన్ని కాస్త తప్పు దోవ పట్టించి ఇప్పుడు నిరుద్యోగ సమస్యను ముందుకు తీసుకువచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి సహకరించడం మాట అటుంచి మా ప్రభుత్వంపైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజలు మేము చేస్తున్న అభివృద్ధిని అంతా గమనిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లోనూ మమ్మల్నే గెలిపిస్తారు అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news