క‌విత‌క్క‌ను క‌లిసిన చెవిరెడ్డి

-

కృష్ణా న‌దీ జలాల‌కు సంబంధించి త‌లెత్తిన వివాదాలు సమసిపోతేనే రాయలసీమ,దక్షిణ తెలంగాణ నీటి సమస్యకు  పరిష్కారం లభిస్తుంది అని ఎమ్మెల్సీ క‌విత‌కు రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం విన్న‌వించింది.ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి నేతృత్వాన ఫోరం క‌న్వీన‌ర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి..ఇటీవ‌ల తిరుప‌తికి వ‌చ్చిన ఆమెను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు.ఇందుకు సానుకూలంగా స్పందించారామె.ఈ  సంద‌ర్భంగా ఫోరం క‌న్వీన‌ర్ మాట్లాడుతూ..వెయ్యేళ్ల కింద‌ట జ‌గ‌ద్గురు రామానుజా చార్యులు తిరుప‌తి చ‌రిత్ర‌కు శ్రీ‌కారం దిద్దార‌ని, అటువంటి జ‌గ‌ద్గురు విగ్ర‌హాన్ని తెలంగాణ‌లోని ఏర్పాటు చేయ‌డం ఎంతైనా అభినందనీయ‌మ‌ని అన్నారు. అనంత‌రం చిత్తూరు జిల్లా వాడుక భాషలో అద్భుతమైన పుస్తక రూపం నామిని ర‌చించిన మిట్టూరోడి పుస్త‌కం అనే క‌థా సంక‌ల‌నాన్ని అందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news