దళిత బంధు పథకం లబ్ధిదారులకు బిగ్ షాక్ !

-

తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ మినహా 118 నియోజకవర్గాల్లో దళిత బంధువులకు లబ్ధిదారుల జాబితాలో సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గానికి 100 మంది చొప్పున అర్హులను ఎంపిక చేయాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్… ఆ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఆశావాహ ఎస్సి కుటుంబాలు ఎమ్మెల్యేలకు దరఖాస్తును సమర్పించాయి.

ఎంపికకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో ప్రజా ప్రతినిధులు తమ విచక్షణ మేరకు ఎంపిక చేస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల జాబితాలు ప్రభుత్వానికి అందగా… ఈనెల 25వ నాటికి మిగతావి చేర నున్నట్లు సమాచారం అందుతోంది. మార్చి నెలాఖరు నాటికి ఆయన లబ్ధిదారులు యూనిట్లు స్థాపించాలని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news