మోదీ పర్యటనలో భద్రత పోలీసుల బాధ్యతే: ఈటల

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్న టీఆర్ఎస్ సర్కార్.. కనీసం ధాన్యం కొనుగోలు చేయని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. వడ్లన్నీ కల్లాల్లోనే ఉండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు నాడు.. కమ్యూనిస్టు పార్టీలు లేవన్న కేసీఆర్‌ నేడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని ఈటల విమర్శించారు. సీఎం కేసీఆర్ అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకుంటున్నారని మండిపడ్డారు. ప్రధానిని రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని అంటున్నారని.. ప్రధాని పర్యటనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు ప్రధాని మోదీ ఇవాళ, రేపు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news