నేనొక్కడినే చర్చకు వెళ్తా..కార్యకర్తలు సమన్వయం పాటించండి : ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

-

అమరావతిలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యేల మధ్య బహిరంగ చర్చకు సంబంధించి జరుగుతున్న వివాదం ప్రస్తుతం పోలీసులకు ఆందోళన కలిగిస్తుంది. అమరావతి ప్రాంతంలో భారీగా పోలీస్ పహారా ఏర్పాటు చేసినప్పటికీ ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అమరావతి చేరుకున్నారని స్పష్టమైన సమాచారం అందుతుంది.

MLA Nambur Shankar Rao

ఈ నేపథ్యంలోనే.. అమరావతి అమరలింగేశ్వర స్వామి సాక్షిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హయాంలో జరిగగిన అవినీతిని, తన హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తానొక్కడినే వెళ్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల నుంచి భారీగా తరలివస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. నిజాన్ని, నిజాయితీని నమ్ముకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన పడవద్దని సూచించారు. నాలుగేళ్ల పాలనలో తాను కానీ, నాయకులు కానీ ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. టీడీపీ పాలనకు మన పాలనకు తేడా ఆధారాలతో సహా చూపించి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కార్యకర్తలే తన బలమని.. దయచేసి వాళ్లు.. ఆందోళన చెందకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.

Read more RELATED
Recommended to you

Latest news