పోలీసులకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన సవాల్

-

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు సంచలన సవాల్ విసిరారు. గురువారం ఈ మేరకు ఓ వీడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు.17న బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను అడ్డుకోవద్దని పోలీసులకు హిందువులను బెదిరిస్తున్నారన్నారు అని తెలిపారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గోవధ చేయొద్దని ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పని హిందూ కార్యకర్తలు చేస్తున్నారని వారిపై రౌడీ షీట్ పెట్టడం ఏంటని రాజా సింగ్ ఫైర్ అయ్యారు. గోవధను పోలీసులు అడ్డుకోకుంటే తాను రంగంలోకి దిగుతా అని అన్నారు. దమ్ముంటే తనను అడ్డుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news