జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

-

గవర్నర్ తమిళసై పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళ సై పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు కౌశిక్ రెడ్డి హాజరయ్యారు.

ఈ నోటీసు అందుకున్న కౌశిక్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఆయన అడ్వకేట్ తో కలిసి జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. గవర్నర్ తన వద్దే బిల్లులు పెట్టుకోవడంపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సరూర్నగర్ కార్పొరేటర్, బిజెపి నేత శ్రీవాణి సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news