అప్పుడు బండ్లగణేష్.. ఇప్పుడు బండి సంజయ్.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో ఆయా పార్టీలలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇటీవలే తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరం గా మారుస్తాము అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

kalvakuntla kavitha supports singareni employees protest on coal mines privatization issue

అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత హైదరాబాద్ పేరు మారిస్తే ఏం లాభమని.. పేరు మార్చడం కాదు పరిపాలన విధానం మార్చుకోవాలి అంటూ విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బండ్లగణేష్ లాగానే ప్రస్తుతం బండి సంజయ్ కూడా కామెడీ షో చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news