మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత

-

మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక ఇవాలే తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరనున్నారు ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులు. 20వ తేదీన హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 20న విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు కవిత ఈ డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. ఆమెను ఈనెల 11న సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఈ నెల 16న మరోసారి రావాలని అదే రోజు సమన్లు జారీ చేశారు.

ఈ సమన్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ వాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. తక్షణమే విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా న్యాయనిపునులతో చర్చించిన అనంతరం ఆమె విచారణకు రాలేనని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై విచారణ పూర్తి అయిన తర్వాతే వస్తానని చెప్పారు. అలాగే తనను ఇంట్లోనే విచారించాలని పేర్కొన్నారు. అయితే ఆమె వినతిని పట్టించుకోని ఈడి ఈనెల 20 కావాల్సిందేనని నోటీసులు పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news