ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఒక నాటకం: సీఎం రేవంత్ రెడ్డి

-

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ బీఆర్ఎస్ , బీజేపి కలిసి ఆడుతున్న నాటకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బ తీసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘కవిత అరెస్టును కేసీఆర్ ఖండించలేదు అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదు. వారిద్దరి మౌనం వెనుక ఏదో వ్యూహం ఉంది. ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

కాగా,నిన్న ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news