ఈ సారి ‘సన్ ఆఫ్ ఇండియా అంటున్న మోహన్ బాబు..!

-

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా రత్నబాబు దర్శకత్వంలో ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఇవాళ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ కింద గురువారం, 2002 అని ఉంది. దానికి కల ప్రాధాన్యం తెలియాల్సి ఉంది.

అలాగే ఈ సినిమాలో ఇంకెవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. కాగా, మోహన్ బాబు ప్రస్తుతం తమిళ్ స్టార్ సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో కొందరు దుండగులు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్ళి హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news