MAA ELECTIONS : క్రమశిక్షణకు వారసుడు.. విష్ణు ఓటేయండి : మోహన్ బాబు బహిరంగ లేఖ

-

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఉత్కంఠగా పరిస్థితులు మారుతున్నాయి. ఒక్కో టాలీవుడ్ నటుడు.. ప్రెస్ మీట్ పెట్టి… తమ మద్దతును ఆయా ప్యానెల్ సభ్యులకు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే డైలాగ్ కింగ్ మోహన్ బాబు… ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తన కుమారుడు మంచు విష్ణు ఓటు వేయాలని మోహన్ బాబు కోరాడు. తన క్రమశిక్షణకు మరియు కమిట్మెంటు కు విష్ణు వారసుడు అని, విష్ణు తో పాటు పూర్తి ప్యానల్ కు ఓటు వేసి సమర్ధమైన పాలనకు సహకరించాలని కోరారు మోహన్ బాబు.

తను మా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే వృద్యాప్య పించన్లు ప్రవేశపెట్టిన సంగతి గుర్తు చేస్తూ మా అధ్యక్ష పదవి ఉంటే కిరీటం కాదని బాధ్యత అని వెల్లడించారు మోహన్ బాబు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా… తాను ముందు ఉంటానని… ఇకముందు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తానని చెప్పారు. ఓటును ఆలోచించి అందరి బాగుకోసం తాపత్రయ పడుతున్న మంచు విష్ణు ప్యానెల్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు మోహన్ బాబు. కాగా మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ పదో తారీఖున జరగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news