సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై మ‌రిన్ని సంచ‌ల‌నాలు లీక్‌..!

-

దివంగ‌త బాలీవుడ్ యువ హీరో వెండితెర ధోని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వ‌స్తోంది. ఈ కేసులో ప్ర‌ధానంగా అంద‌రి వేళ్లు సుశాంత్ ప్రియురాలు, హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తి వైపే ఉంటున్నాయి. ఇక సుశాంత్ కుటుంబ స‌భ్యులు సైతం రియాను అనుమానించ‌డంతో పాటు ఆమెపై కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సీబీఐ సైతం రియాను విచారిస్తోంది. రేపో మాపో ఆమెను అరెస్టు చేసినా చేయ‌వ‌చ్చ‌ని కూడా తెలుస్తోంది.

ఇక ఈ కేసు మ‌హారాష్ట్ర‌, బిహార్ రాష్ట్రాల పోలీసుల మ‌ధ్య సైతం చిచ్చు పెట్టింది.  ఈ కేసు వెన‌క బాలీవుడ్‌లో ఎంతో మంది పెద్ద హీరోలు, ద‌ర్శ‌కులు ఉన్నార‌ని మ‌రో టాక్ కూడా వ‌స్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసు విష‌యంలో ముందు నుంచి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మ‌రోసారి అనేక సందేహాల‌కు తావు ఇచ్చే వ్యాఖ్య‌లు చేశారు. సుశాంత్ హ‌త్య జ‌రిగిన రోజు దుబాయ్ కంప్లైంట్ డ్ర‌గ్ డీల‌ర్ ఆయాష్ ఖాన్ సుశాంత్ కలిశార‌ని స్వామి ఆరోపించారు. ఇక ఈ కేసుకు కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ భార్య సునంద పుష్క‌ర్ హ‌త్య‌కు కూడా ఆయ‌న లింక్ పెట్టి మాట్లాడారు.

సునంద‌ పోస్టుమార్ట‌మ్ జ‌రిగిన‌ప్పుడే ఆమె క‌డుపులో ఉన్న‌వాటితోనే నిజం ఏంటో తెలిసిపోయింద‌ని.. కానీ దివంగ‌త న‌టి శ్రీదేవి, సుశాంత్ కేసులో ఇలా ఎందుకు జ‌ర‌గ‌లేద‌ని స్వామి చెప్పారు. ఇక వారం రోజుల క్రిత‌మే స్వామి శ్రీదేవి, సుశాంత్ మృతికి దుబాయ్‌కు లింకులు ఉండ‌వ‌చ్చ‌ని కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  ఇక సుశాంత్ చ‌నిపోయిన రోజు ఆ డ్ర‌గ్ డీల‌ర్ ఆయుష్ ఖాన్‌ను ఎందుకు క‌లిశాడో కూడా సీబీఐ నిగ్గు తేల్చాల‌ని స్వామి డిమాండ్ చేశారు. ఇక సుశాంత్ మృతి చెందిన‌ప్ప‌టి నుంచి స్వామి బాలీవుడ్ పెద్ద‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆయ‌న తాజా వ్యాఖ్య‌ల‌తో ఈ కేసులో వ‌స్తోన్న సందేహాల‌కు కొత్త సందేహాలు తోడ‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news