బండి సంజయ్ కి ఒక ట్రాక్టర్ కొనిస్తాం… దున్నుకోవాలి : మోత్కుపల్లి

-

బండి సంజయ్‌ పై ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు మాజీమంత్రిమోత్కు పల్లి నర్సింలు. బండి సంజయ్ దున్నాలనిపిస్తే ఒక ట్రాక్టర్ కొనిస్తాం…అప్పుడు దున్నుకోవాలని చురకలు అంటించారు మోత్కుపల్లి. కేసీఆర్ ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడిమసై పోతాడని బండి సంజయ్‌కి వార్నింగ ఇచ్చాడు.
నిన్న బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని… దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని ఫైర్‌ అయ్యారు.

దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా ? బీజేపీ నేతలకు సిగ్గు ఉందా? అని చురకలు అంటించారు. కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోందని ఫైర్‌ అయ్యారు. బీజేపీ నేతలకు బుద్ధి ఉందా? ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలని….తన అనుభవంలో చాలామంది సిఎంలను చూసానని గుర్తు చేశారు. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నానని… దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారు- బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news