కేసీఆర్‌ సమక్షంలో నేడు టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

-

మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు మోత్కుపల్లి నరసింహులు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేణు ఉన్నారు మోత్కుపల్లి. ఆ తర్వాత బషీర్బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఆ తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు మోత్కుపల్లి. అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో మధ్యాహ్నం టిఆర్ఎస్ పార్టీ లో అధికారికంగా చేరనున్నారు. అంతేకాదు మోత్కుపల్లి నర్సింహులు కు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news