వరల్డ్ కప్ ఫైనల్ కు రానున్న సినీ ప్రముఖులు వీరే!

-

ఆదివారం అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో ఎంతో ఆర్భాటంగా జరగనున్న వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ ను ప్రత్యక్షముగా వీక్షించడానికి దేశంలోని చాలా మంది పొలిటికల్, మూవీ స్టార్స్ రానున్నారు. ఈ మ్యాచ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ ను చూడడానికి మోదీ ఎలాగో రానున్నారని ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ రానుండగా, సౌత్ ఇండస్ట్రీ నుండి రజినికాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, వెంకటేష్, నాగార్జున మరియు రామ్ చరణ్ లు విచ్చేయనున్నారు.

ఇక తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన వెంకటేష్, నాగార్జున మరియు రామ్ చరణ్ లు వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వీరిని చూడడానికి, మరి వీరిదరి రాకతో ఆశీస్సులు ఇండియా టీం కు అంది కప్ ను అందుకోవాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news