బిగ్ బాస్: టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పేసిన నాగార్జున..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ కి చేరుకుంటున్న నేపథ్యంలో టాప్ 5 లో నిలిచే కంటెస్టెంట్స్ ఎవరు? ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు ? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. అయితే దీనిమీద చాలామంది విశ్లేషకులు, బిగ్ బాస్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు. అయితే తొలిసారి బిగ్ బాస్ షో లోని టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనే విషయంలో తాజాగా ఓటింగ్ జరిగింది. ఇంటి సభ్యుల అభిప్రాయాలు తీసుకొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా ప్రస్తుతం ఎవరున్నారు అనే విషయంలో ఒక స్పష్టత ఇచ్చారు నాగార్జున.

టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరిని కన్ఫేషన్ రూమ్ లోకి పిలిచి బాటమ్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. అయితే అందుకు సరైన కారణాలు కూడా వివరించాలని తెలిపాడు. ముందుగా ఆది రెడ్డిని నాగార్జున కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. బాటమ్ ఫైవ్ లో ఎవరున్నారో చెప్పాలని ఆదిరెడ్డిని నాగార్జున అడిగారు. కన్ఫెషన్ రూమ్ లో కంటెస్టెంట్ చెబుతుంటే మిగిలిన హౌస్ మేట్స్ టీవీలో చూశారు. ఒక్కో కంటెస్టెంట్ బాటమ్ 5 కంటెస్టెంట్ లిస్టు తెలిపారు.

అయితే ఈ పదిమంది నిర్ణయాలు తీసుకున్న తర్వాత హౌస్ లో ఉన్న పదిమందిలో బాటమ్ ఫైవ్ లో ఇనయ, కీర్తి , రాజ్ ,మెరీనా ,రోహిత్ ఉన్నారని నాగార్జున వెల్లడించారు. కానీ ఎట్టకేలకు మెరీనా ఎలిమినేట్ అవ్వడంతో బాటమ్ ఫోర్ లో ఉన్నవాళ్లు టాప్ ఫైవ్ లో వెళ్లాలంటే ఎలా ఆడాలో అలా ఆడండి అంటూ వారిని ప్రోత్సహించారు. మరొకవైపు టాప్ ఫైవ్ లో ఉన్న రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమా, ఆదిరెడ్డిని నాగార్జున హెచ్చరించారు.. సరిగ్గా ఆడకపోతే బాటమ్ 5 పొజిషన్లోకి వెళ్తారని కూడా వార్నింగ్ ఇచ్చారు. మెరీనా వెళ్లిపోవడంతో బాటమ్ 4 లో ఉన్న వీరు టాప్ ఫైల్ లోకి వెళ్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news