ఏపీలో దుమారం రేపుతున్న ఓవైసీ వ్యాఖ్యలు

-

సంచలన వ్యాఖ్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఈ సారీ ఆంధ్రప్రదేశ్‌లో చేసిన వ్యాఖ్యాలు దూమారం రేపుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 9 మంది అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ‘జగన్‌ జాగ్రత్త.. బీజేపీ తరుముకోస్తోంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ అప్రమత్తమవ్వాలని లేదంటే భారీ ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇటీవల ఆలయాలపై జరిగిన దాడులు కొందరు హిందుత్వాల పనే నని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీని భూస్థాపితం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోందని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు వీడిపోయిన తర్వాత అటువైపు వెళ్లని ఎంఐఎం అధినేత ఈ సారి ఏపీలో తమ పార్టీని విస్తరించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు చేస్తోంది. వస్తు వస్తూనే ఆయన చేసిన వ్యాఖ్యాలు రెండు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news